ఒకేషనల్ కోర్సును కొనసాగించకపోతే ఉద్యమిస్తాం
ABN, Publish Date - Jun 03 , 2025 | 11:25 PM
రాష్ట్ర వ్యాప్తం గా గురుకుల విద్యాలయాల్లో ఒకేషనల్ కోర్సులను కొనసా గించాలని స్వేరోస్ సీనియర్ నాయకుడు దుబ్బ నాగేష్ డిమాండ్ చేశారు.
- స్వేరోస్ నాయకులు
తెలకపల్లి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తం గా గురుకుల విద్యాలయాల్లో ఒకేషనల్ కోర్సులను కొనసా గించాలని స్వేరోస్ సీనియర్ నాయకుడు దుబ్బ నాగేష్ డిమాండ్ చేశారు. గురుకుల విద్యాలయాల్లో ఒకేషనల్ కోర్సు లను రద్దు చేయడాన్ని నిరసి స్తూ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల సమీపంలో ఉన్న మల్లాల మ్మ గుడి సమీపంలో మంగళవారం రాస్తారో కో నిర్వహించారు. నాగేష్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఒకేషనల్ విద్యను అందనివ్వకుం డా ప్రభుత్వం కుట్రపన్నుతోందని విమర్శిం చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని వినతి పత్రాలు అం దజేసినా అధికారులు స్పందన లేకపోవడంతోనే రాస్తారోకో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పోలీసులు స్వేరోస్ నాయకులతో మాట్లాడి రా స్తారోకో విమింపజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిట్ ఇండియా కార్యదర్శి తోకల విష్టు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్, ఉపా ధ్యక్షుడు మోహన్, కార్యదర్శి ధర్మరాజ్, మబ్బు రాము, తెలకపల్లి టౌన్ అధ్యక్షుడు భారీగారి పరమేశ్వర్, ఉపాధ్యక్షుడు బల్మూరు మల్లేష్, సంపత్ కుమార్, వీరస్వామి పాల్గొన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 11:25 PM