పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:44 PM
ప్రపం చ పర్యావరణ దినం పురస్కరించుకొని జిల్లాలో పలు సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
- ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కందనూలు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి) : ప్రపం చ పర్యావరణ దినం పురస్కరించుకొని జిల్లాలో పలు సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. కోర్టు ప్రాంగణంలో న్యాయాధికా రులు, అటవీశాఖ అధికారులు, జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు, ఉప్పునుంతలలో సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, వంగూ రులో ఎంపీడీవో ఆధ్వర్యంలో, అమ్రాబాద్లో ఉపాధి హామీ పథకం ఏపీవో ఆధ్వర్యంలో మొ క్కలు నాటి, ర్యాలీలు నిర్వహించారు. పర్యావర ణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని వ క్తలు సూచించారు. అడవులు అంతరించిపోవ డం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని మానవాళి మ నుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఫ ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరిం చుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయాధికారి డి.రమాకాంత్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ రకాల మొక్కలు నాటారు. కార్యక్ర మంలో సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎన్.వెం కట్రామ్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎన్.శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.రవికాంతారావు, జనరల్ సెక్రటరీ ఎం.మధుసూదన్రావు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ దేవరాజు, ఇతర ఫారెస్టు అధికారులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఫ కల్వకుర్తి : కల్వకుర్తి కోర్టు ఆవరణలో న్యాయాధికారులు ఏ.శ్రీదేవి, జే.కావ్య మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో సీనియర్ సి విల్ కోర్టు సూపరింటెండెంట్ ఆనంద్, జూని యర్ సివిల్కోర్టు సూపరింటెండెంట్ సత్యం, కో ర్టు సిబ్బంది చంద్రశేఖర్, ఆలివేల, స్వరూప, అ నిల్, సి.శ్రీలత, డి.శ్రీ లత, జూనియర్ సివిల్ కో ర్టు సిబ్బంది పార్వతమ్మ, స్వామి, రాజేంద్ర ప్ర సాద్, దినేష్, శంకర్, పారిజాత, దేవి, మౌనిక, మాధవి, ఏసీజీ వెం కట్రెడ్డి, న్యాయవాదు లు, మునిసిపల్, పోలీ స్ సిబ్బంది ఉన్నారు.
ఫ దోమలపెంట : అమ్రాబాద్ అభయా రణ్య ప్రాంతంలో ప్లాస్టి క్ రహిత ప్రాంతంగా ప్రతీ ఒక్కరు కృషి చే యాలని దోమలపెం ట ఎఫ్ఆర్వో గురుప్ర సాద్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినం సంద ర్భంగా గురువారం వటువర్లపల్లిలో దోమలపేం ట రేంజ్ పరిధిలోని అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో శ్రీశైలం- హైదరాబాద్ ప్ర ధాన రహదారి వెంట ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అమ్రాబాద్ అభయారణ్యంలో ప్లా స్టిక్ వాడటం నిషేధించేందుకు గత సంవత్సరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా జనాలు అంతగా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్ర మంలో ఎఫ్ఎస్వోలు ధర్మానాయక్, రామాంజ నేయులు, బషీర్, తాజుద్దీన్, ఎఫ్బీవోలు తేజశ్రీ, శిల్ప, రాజేశ్వరి, వెంకటేష్ పాల్గొన్నారు.
ఫ అచ్చంపేటటౌన్ : పర్యావరణ సమతు ల్యత మానవ మనుగడకు జీవం పోస్తుందని అచ్చంపేట ఫారెస్టు అధికారి సుబూర్ అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలో పారెస్టు సిబ్బంది పర్యావరణపై అవ గాహన ర్యాలీ నిర్వహించారు. ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ నాగర్కర్నూల్ టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం ప్ర పంచ పర్యావరణ దినాన్ని నిర్వహించారు. కళా శాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ ఆధ్వర్యంలో అ ధ్యాపకులు కళాశాల ఆవరణలో మొక్కలు నా టారు.కార్యక్రమంలో కళాశాల పరిపాలనాధికారి మహ్మద్ ఇర్ఫాన్, సీనియర్ అధ్యాపకులు అంజ య్య, ఉమాదేవి, రామకృష్ణ పాల్గొన్నారు.
ఫ ఉప్పునుంతల : ప్రపంచ పర్యావరణ పరి రక్షణ దినం పురస్కరించుకొని మండల కేంద్రం లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి స్వప్న ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వ హించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ప్రభావ తి, ఎంఎల్హెచ్పీ, ఆశాలు, ఏఎన్ఎంలు, హెల్త్అసిసెంట్లు ఉన్నారు.
ఫ వంగూరు : మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ఎంపీడీవో బ్రహ్మాచారి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఏపీవో శివశేఖర్గౌడ్, దిలీప్కుమార్ పాల్గొన్నారు.
ఫ అమ్రాబాద్ : మండల పరిధిలోని మన్న నూరు గ్రామానికి చెందిన ఒక రైతు వ్యవసాయ పొలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి ఏపీవో రఘు ఆధ్వర్యంలో పర్యావ రణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీఏ వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణా నాయక్ ఉన్నారు.
ఫ ఏకల్ గ్రామోదయ్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో గురువారం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్రాబాద్లో ర్యాలీ నిర్వహిం చారు. ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ హరీష్ గౌడ్, వివేకానంద యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 11:44 PM