రాబోయే ఎన్నికల్లో సత్తాచాటాలి
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:35 PM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తాచాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వ ర్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని చిర్రకుంట గ్రామంలో బీజేపీ నాయకుల సమావేశం జరిగింది.
మందమర్రిరూరల్, జూన్8 (ఆంధ్రజ్యోతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తాచాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వ ర్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని చిర్రకుంట గ్రామంలో బీజేపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడి ప్రభుత్వం పేద సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని పేర్కొన్నార. 11 సంవత్సరాల్లో గతంలో ఏ ప్రదాన మంత్రి చేయ ని సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బీ జేపీని ప్రతిష్ట పరుచాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై, ప్రభు త్వ నిర్లక్ష్యంపై వ్యూహంతో వ్యవహరించాలని నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దేవరనేని సంజీవరావు, దుర్గం అశోక్, సీనియర్ నాయకులు దీక్షితులు, ప్రధాన కార్యదర్శి వంజరి వెంకటేశ్, కర్రె రాజయ్య పాల్గొన్నారు.
Updated Date - Jun 08 , 2025 | 11:35 PM