గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ABN, Publish Date - May 15 , 2025 | 12:20 AM
గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు నల్లగొండ రై ల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
తిప్పర్తి, మే 14(ఆంధ్రజ్యోతి): గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు నల్లగొండ రై ల్వే ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ - రాయినిగూడెం స్టేషన్ల మధ్య ఎఫ్సీఐ గో దాంల సమీపంలో సుమారు (45) వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు ఆయన తెలిపారు. మృతుడు 5.5 అ డుగుల ఎత్తు ఉన్నాడని, శరీరంపై ఆఫ్ తెల్లని బనియన, బ్రౌన కలర్ డ్రాయర్ ధరించి ఉన్న ట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల ముందు రైలు పట్టాల పక్కన పడి ఉన్నట్లు రైల్వే కీ మ్యాన ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. కేసు నమో దు చేసుకొని మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించిన ట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 8712658595కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
Updated Date - May 15 , 2025 | 12:20 AM