ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్
ABN, Publish Date - May 13 , 2025 | 11:21 PM
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని, ఉపాద్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ పట్టణంలోని తీగల్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంఘీక శాస్త్ర ఉపాద్యాయుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్యతో కలిసి హాజరయ్యారు.
కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, మే 13 (ఆంధ్రజ్యోతి) : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలని, ఉపాద్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ పట్టణంలోని తీగల్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సాంఘీక శాస్త్ర ఉపాద్యాయుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ స్థాపనలో విద్యార్థులను ఉత్తమమైన, ఆదర్శనీయమైన విద్యార్థులుగా సిద్ధం చేయాలని సూచించారు. ఉపాద్యాయులు ఉత్తమ విద్యార్థులను తయారు చేయగలుగుతారని, సామర్థ్యాల పెంపుకై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఉపాద్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అని, తాను నేర్చుకుంటూ విద్యాబోధన చేసినప్పుడే విద్యార్థులలో గుణాత్మకమైన మార్పు సాధించవచ్చునన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, నూతన విషయాలను తెలియజేస్తాయని, ప్రతి ఉపాద్యాయుడు శిక్షణలో అందిస్తున్న అంశాలను ఆకలింపు చేసుకొని పాఠశాల స్థాయికి తీసుకెళ్లి విద్యార్థుల్లో ఆశించిన మార్పుల సాధన లక్ష్యంగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సమన్వయ కర్తలు చౌదరి, సత్యనారాయణ మూర్తి, కోర్సు డైరెక్టర్ రామన్న, రిసోర్స్ పర్సన్లు మహేశ్, రాజేశ్వరి, రమేశ్, రాజన్న, వివిధ మండలాలకు చెందిన సాంఘీక శాస్త్ర ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 11:21 PM