శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Jul 08 , 2025 | 11:25 PM
బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఆర్డీవో ఎస్. శ్రీను అన్నారు.
- బీఎల్వోలకు సూచించిన కల్వకుర్తి ఆర్డీవో ఎస్ శ్రీను
కల్వకుర్తి, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఆర్డీవో ఎస్. శ్రీను అన్నారు. మంగళవారం కల్వకు ర్తి మునిసిపాలిటీ పరిధిలోని బీఎల్ఓ లకు ఓరియంటేషన్ ట్రైనింగ్ కార్యక్ర మం నిర్వహించారు. శిక్షణలో మాస్టర్ ట్రైనర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్ర మానికి కల్వ కుర్తి ఆర్డీవో శ్రీను, తహసీల్దారు ఇబ్రహీం, మునిసిపల్ కమిషనర్ మహ్మద్షేక్ హాజరయ్యారు. కార్యక్రమంలో డీటీ రాఘవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 11:25 PM