ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:58 AM

మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకాఎల్లమ్మ ఆలయంలో వైశాఖమాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

కనగల్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకాఎల్లమ్మ ఆలయంలో వైశాఖమాసం మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో కుంకుమ అభిషేక పూజలు జరిపించారు. చీరసారె, ఒడిబియ్యం బోననైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం ఆలయ ముఖ్య అర్చకులు మల్లాచారి ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి మహా మంగళ నీరాజన హారతులిచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ సిబ్బంది ఆలయ కమిటీ చైర్మన చీదేటి వెంకట్‌రెడ్డి, ఈవో జయరామయ్య ఆధ్వర్యంలో సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు.

Updated Date - Apr 30 , 2025 | 12:58 AM