యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు
ABN, First Publish Date - 2025-05-29T00:26:09+05:30
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట, మే 28(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్రభాతంతో స్వామిఅమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయం భూవులను, సువర్ణ ప్రతిష్టామూర్తులను అభిషేకరించి తులసీదళాలతో సహస్రనా ర్చనలు నిర్వహించారు. ప్రధానాలయం అష్టభుజి ప్రాకార మండపంలో స్వామి అమ్మవారిని అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలిపూజలతో నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అంకార వెండిజోడు సేవలు, సహస్రనార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిత్య పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో పర్వతవర్థిని రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్ధతి లో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.30,83,173 ఆదా యం సమకూరినట్లు ఈవో వెంకట్రావు తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్. మధుసూ దన్రావు దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వేర్వేరుగా యాదగిరిగుట్టకు వ చ్చారు. గర్భాలయంలోని స్వయంభూవులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పండితులు వారికి స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి ఆశీర్వచనం చేశారు.
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామి నిత్య కల్యాణాన్ని వేదపండితులు నిర్వహించారు. ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం స్వామివారికి మాంగళ్యధారణ తలంబ్రాలుతో నిత్య కల్యాణం నిర్వహించారు. నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన గావించి తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్, ఆలయ అర్చకులు తూమాటిశ్రీనివాసాచార్యులు, పధ్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, లక్ష్మీనరసింహామూర్తి,సీతరామశాస్ర్తీ, శేషగిరిరావు, రాజష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2025-05-29T00:26:20+05:30 IST