అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN, Publish Date - Jun 30 , 2025 | 12:39 AM
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్ రాష్ట్రనేత, వైఎ్సఆర్ ఫౌండేషన్ అధినేత యెల్లంల సంజీవరెడ్డి సొంత నిధులతో ఆదివారం మండలంలోని పిట్టలగూడెం గ్రామనికి చెందిన 45మంది కుటుంబాలకు సమకూర్చిన విద్యుత్ మీటర్లను బీర్ల అయిలయ్యతో కలిసి అందజేశారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
మోటకొండూరు, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్ రాష్ట్రనేత, వైఎ్సఆర్ ఫౌండేషన్ అధినేత యెల్లంల సంజీవరెడ్డి సొంత నిధులతో ఆదివారం మండలంలోని పిట్టలగూడెం గ్రామనికి చెందిన 45మంది కుటుంబాలకు సమకూర్చిన విద్యుత్ మీటర్లను బీర్ల అయిలయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామానికి ప్రస్తుతం వచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కాకుండా మరో 20 ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పిట్టలగూడెం అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చాడ శశిధర్రెడ్డి, ఆకుల శ్రీనివాస్, నెమ్మని సుబ్రమణ్యం, అక్ష్మరెడ్డి, బెజ్జంకి మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 12:39 AM