సీఎం సభను అడ్డుకుంటాం
ABN, Publish Date - Jun 06 , 2025 | 12:22 AM
బొమ్మలరామారం, జూన 5 (ఆంధ్రజ్యోతి):నేడు జిల్లాలో సీఎం రేవంతరెడ్డి సభ ను అడ్డుకుంటామని సర్పంచుల ఫోరం మాజీ రాష్ట్ర కోశాధికారి పూడూరి నవీన గౌడ్ అన్నారు.
బొమ్మలరామారం, జూన 5 (ఆంధ్రజ్యోతి):నేడు జిల్లాలో సీఎం రేవంతరెడ్డి సభ ను అడ్డుకుంటామని సర్పంచుల ఫోరం మాజీ రాష్ట్ర కోశాధికారి పూడూరి నవీన గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచుల పదవీకాలంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టి సర్పంచుల బతుకులతో ఆటాడుతుందన్నారు. 18 నెలలుగా రావాల్సిన పెం డింగ్ బిల్లులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. కొన్ని రోజుల క్రితం సర్పంచుల బిల్లులు రూ.153 కోట్లు రిలీజ్ చేశామని అబద్దపు ప్రచారం ప్రభుత్వం చేసిందని, ముందుగా సర్పంచుల పెండింగ్ బి ల్లులు చెల్లించిన తర్వాతనే ముఖ్యమంత్రి పర్యటించాలని లేని యెడల సీఎం పర్యటనని జిల్లా మాజీ సర్పంచుల అందరం కలి సి అడ్డుకుంటామన్నారు.సమావేశంలో సర్పంచుల ఫోరం కార్యదర్శులు మెడబోయిన గణేష్, బకీర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 12:23 AM