విద్యాసంస్థల బంద్ విజయవంతం
ABN, Publish Date - Jul 24 , 2025 | 12:59 AM
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది.
తుర్కపల్లి: రామాపూర్ మోడల్స్కూల్లో తరగతులను బహిష్కరింపజేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
ఆంధ్రజ్యోతి-న్యూస్ నెట్వర్క్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూసివేయించారు. ఈ సందర్భంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో పోస్టులు భర్తీ చేయడంతో పాటు ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jul 24 , 2025 | 12:59 AM