ఎస్టీపీపీలో ఎంఎన్జీఎల్ బృందం పర్యటన
ABN, Publish Date - Jun 12 , 2025 | 11:49 PM
మండల కేంద్రంలోని సింగరే ణి థర్మల్ పవర్ ప్లాంట్లో గురువారం మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ లిమిటెడ్ (ఎంఎన్జీఎల్) బృందం పర్యటించినట్లు ఎస్టీపీపీ జీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. జీఎం (ఓసీ పీఎస్) డీవీఎస్ఎన్ రాజు ఆ ధ్వర్యంలో బృందం అధికారులు ఎస్టీపీపీలోని మైన్స్ థర్మల్ పవర్ ప్లాంట్ను సందర్శించారు.
జైపూర్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని సింగరే ణి థర్మల్ పవర్ ప్లాంట్లో గురువారం మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ లిమిటెడ్ (ఎంఎన్జీఎల్) బృందం పర్యటించినట్లు ఎస్టీపీపీ జీఎం శ్రీనివాసులు పేర్కొన్నారు. జీఎం (ఓసీ పీఎస్) డీవీఎస్ఎన్ రాజు ఆ ధ్వర్యంలో బృందం అధికారులు ఎస్టీపీపీలోని మైన్స్ థర్మల్ పవర్ ప్లాంట్ను సందర్శించారు. థర్మల్ ప్లాంట్లో లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ వినియోగానికి అవసరమైన సదుపాయాలను పరిశీలించారు. అనం తరం నిర్వహించిన సమావేశంలో న్యాచురల్ గ్యాస్ వినియోగం ద్వా రా కర్బన ఉద్గారాల తగ్గింపుతో పాటు పర్యావరణ పరిరక్షణకు దో హదపడుతుందని సభ్యులు పేర్కొన్నారు. ఎస్టీపీపీ అధికారులు జే ఎన్ సింగ్, శివ ప్రసాద్, మురళీధర్, మదన్ మోహన్ పాల్గొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 11:50 PM