24గంటలూ వైద్య సేవలు అందించాలి
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:26 PM
మండల కేంద్రంలో గురువా రం విద్యార్థులతో కలిసి వన మహోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅ తిథులు గా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి హాజరయ్యా రు.
- ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి
తెలకపల్లి,జూలై17 (ఆంధ్రజ్యో తి) : మండల కేంద్రంలో గురువా రం విద్యార్థులతో కలిసి వన మహోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅ తిథులు గా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి హాజరయ్యా రు. ఈ సందర్భంగా కల్వకుర్తి రోడ్డు లో పర్యావరణ పరిరక్షణలో భాగం గా మొక్కలు నాటారు. మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయం సమీపంలో నూతనంగా మంజూరైన డ్రైనేజ్ వ్య వస్థ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అంతకముందు మండల పరిధిలోని పెద్దపల్లి నుండి మరికల్ వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడున్న సిబ్బందిపై ఆరా తీశారు. శ్రీశై లం ప్రధాన రహదారి పక్కన ప్రాథమిక ఆరో గ్య కేంద్రం ఉన్నందున రోగులకు 24 గంటలు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించా లని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, వైస్ చైర్మన్ జంగయ్య, సింగిల్వండో చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్, మాజీ ఎంపీపీ బండా పర్వతాలు, మండల నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jul 17 , 2025 | 11:26 PM