కార్మికుల ఆరోగ్యం కోసమే వైద్య శిబిరం
ABN, Publish Date - Jul 04 , 2025 | 11:30 PM
ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలి టిలో పని చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు తెలిపారు.
- మున్సిపల్ కమిషనర్ రాజలింగు
మందమర్రి,జూలై4(ఆంధ్రజ్యోతి):ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలి టిలో పని చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది ఆరోగ్యం గా ఉండేందుకు ఈ పరీక్షలు చేస్తున్నామన్నారు. దోమల నివారణకు సం బంధించి మున్సిపాలిటి ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. హెల్త్ ఆఫీసర్ శిరీష మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని తెలి పారు. అనంతరం సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మందులు పం పిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్కూడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైద్య సిబ్బందితో పాటు మున్సిపల్ ఇంజనీర్ సుమతి, రెవెన్యూ ఆఫీసర్ కిష్ట ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు గోపి క్రిష్ణ, పీఎంసీ రఘురాము, మెడికల్ ఆఫీసర్ రమేశ్ పాల్గొన్నారు.
Updated Date - Jul 04 , 2025 | 11:30 PM