Telangana Govt: భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
ABN, Publish Date - Jun 25 , 2025 | 08:07 AM
రాష్ట్రంలో 116 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. పురపాలక శాఖ ఇటీవల రెవెన్యూ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ సెక్షన్ఆఫీసర్లుగా...
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో 116 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. పురపాలక శాఖ ఇటీవల రెవెన్యూ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, సీనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ సెక్షన్ఆఫీసర్లుగా పనిచేస్తున్న 37 మందికి గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పించింది. వీరికి పోస్టింగ్లు ఇవ్వనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 116 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ సోమవారం పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి ఉత్తర్వులిచ్చారు. బదిలీ అయిన వారిలో గ్రేడ్-1, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు 60 మంది, గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్లు 56 మంది ఉన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 08:08 AM