తేజేశ్వర్ను హత్య చేసిన వారిని ఉరితీయాలి
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:38 PM
తేజేశ్వర్ హత్యకు కారకులైన వారిని వెంటనే ఉరితీయాలని, బాధితులకు న్యాయం జరగాలంటే వెంటనే జిల్లాలో ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని మృతుడు తేజేశ్వర్ అక్క రమాదేవి డి మాండ్ చేసారు.
గద్వాల క్రైం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): తేజేశ్వర్ హత్యకు కారకులైన వారిని వెంటనే ఉరితీయాలని, బాధితులకు న్యాయం జరగాలంటే వెంటనే జిల్లాలో ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని మృతుడు తేజేశ్వర్ అక్క రమాదేవి డి మాండ్ చేసారు. ఆదివారం సాయంత్రం హ త్యకు గురైన తేజేశ్వర్ ఇంటి నుంచి కుటుంబ స భ్యులు, బంధువులు, మిత్రబృందం ర్యాలీగా బ యలుదేరి కృష్ణవేణి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మృతుడు తేజేశ్వర్ అక్క రమాదేవి, అన్న తేజవర్ధన్ మాట్లాడుతూ.. తమ తమ్ముడిని ఐశ్వర్య పెళ్లి చేసుకొని ఐశ్వర్యప్రియు డు అయిన తిరుమల్రావుతో కలిసి హత్యచేయించడం దారుణమన్నారు. తేజేశ్వర్ హత్యకు కారకులైన వారి తరుపున ఓ న్యాయవాది కూ డా వాధించకుండా నిందితులకు ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు ఉన్న కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఉన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 11:38 PM