60ఏళ్లు పైబడిన వారికి టీబీ పరీక్షలు
ABN, Publish Date - Jun 06 , 2025 | 11:06 PM
60ఏళ్లు పైబడిన వారిందరికి టీబీ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్ సిద్పప్ప అన్నారు.
డీఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప
గద్వాల న్యూటౌన్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): 60ఏళ్లు పైబడిన వారిందరికి టీబీ పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్వో డాక్టర్ సిద్పప్ప అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రామ్నగర్లోని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం టీబీ ముక్త్భారత్ అభియాన్ కార్యక్రమాన్ని డీ ఎంహెచ్వో డాక్టర్ సిద్దప్ప ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..... టీబీ లక్షణాలతో బాధపడుతున్న వాళ్లను, ఐరిస్క్ పాఫులేషన్ ను, అందులో షుగర్ ఉన్నవాళ్లను, బీపీ ఉన్నవాళ్లతో పాటు 60 సంవత్సరాలు పైబడిన వారిని, టీబీ ఉన్నవాళ్లను, గతంలో టీబీ ఉన్న వ్యక్తులను, వారి కుటుంబ సభ్యులను అందరికి టీబీ పరీక్షలు చేయించడమే ఈ కార్యక్రమ ము ఖ్య ఉద్ధేమన్నారు. మొదటి రోజు 12 మందికి ఎక్స్రే, 30 మందికి గళ్ల పరీక్షలు చేయించడం జరిగిందన్నారు. అనుమానిత టీబీ లక్షణాలు ఉన్న ప్రతీఒక్కరికి పరీక్షలు నిర్వహించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు, డాక్టర్లు మాధుర్య, ప్రియాంక, డిప్యూటి డెమో మధుసూదన్రెడ్డి, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 11:06 PM