సామాజిక న్యాయం వైపు అడుగులు..
ABN, Publish Date - Jun 08 , 2025 | 11:45 PM
బీసీ సంఘాల పోరాటాల ఫలితం గానే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్
కొత్తకోట, జూన్ 8 (ఆంధ్రజ్యోతి) : బీసీ సంఘాల పోరాటాల ఫలితం గానే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం వడ్డెవాటలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అ నంతరం కొత్తకోటలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ముగ్గురు బీసీ, ఎస్సీలకు మంత్రి పదవులు కల్పించడం స్వాగతిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ కమిట్మెంట్ ప్రకారంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మొన్న ఎమ్మెల్సీ ఎ న్నికల సందర్భంగా ఐదుగురికి అవకాశం ఇవ్వడం శుభ పరిణామమ న్నారు. నామినేటెడ్ పదవుల ఎంపిక కూడా ఇలాగే కూడా ఉంటుందని భావిస్తు న్నా మన్నారు. ఇంతటితో ఊరుకునేది లేదని, మేము ఎంతో మాకు అంత వా టా కోసం పోరాటం చేయడానికి తగ్గేదే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కు లగణన చేపట్టి బీసీ జనాభా 56.7 శాతం ఉందని తేల్చిందని, అదే వాటా హక్కుగా రావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్య క్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి రామన్గౌడ్, జిల్లా అధ్యక్షుడు భీమన్న నా యుడు, బాలరాజుగౌడ్, చంద్రశేఖర్, వెంకట్, జనార్దన్గౌడ్, బస్వరాజ్, రంగ స్వామి, వెంకటన్నగౌడ్, తిరుపతయ్య, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 08 , 2025 | 11:45 PM