నరసింహ స్వామి జయంత్యుత్సవాలు
ABN, Publish Date - May 11 , 2025 | 11:04 PM
జిల్లా కేంద్రంలోని లక్ష్మీనర్సింహ సహిత రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం నర్సింహ స్వా మి జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిం చారు.
- నేడు కల్యాణం, మహా రథోత్సవం
నారాయణపేట, మే 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని లక్ష్మీనర్సింహ సహిత రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం నర్సింహ స్వా మి జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహిం చారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి సు ప్రభాతం, నిర్మాల్యం, పంచామృతాభిషేకం, అ లంకరణ, వసంతపూజ, భజన, పల్లకీసేవ చేప ట్టారు. జ్యోషి రఘుప్రేమ చార్య ఆధ్యాత్మిక ప్రవ చనం చేశారు. నర్సింహస్వామిని కొలిచి వారికి భయం నివారణతోపాటు సకల కార్యసిద్ధి జరు గుతుందన్నారు. ఆలయానికి రూ.లక్ష అందిం చిన ఓబ్లాపూర్కు చెందిన రఘుత్తమరావుకు రా ఘవేంద్ర సేవాసమితి తరపున సత్కరించారు. కార్యక్రమంలో అర్చకులు నర్సింహచారి, అనిల్ దేశాయి, శక్తి పీఠం వ్యవస్థాపకుడు శాంతనంద స్వామి, భీంసేన్రావు, శ్రీపాద్ పాల్గొన్నారు.
నేడు కల్యాణం, రథోత్సవం
ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యా హ్నం రాఘవేంద్రస్వామి ఆలయంలో లక్ష్మీన ర్సింహస్వామి కల్యాణ వేడుకల అనంతరం మ ధ్యాహ్నం రథోత్సవం ఉంటుందని, భక్తులు పా ల్గొనాలని అర్చకుడు నర్సింహాచారి కోరారు.
Updated Date - May 11 , 2025 | 11:04 PM