భూసమస్యలు క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించాలి
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:14 PM
గుర్తించిన భూసమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్తిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు.
భీంపూర్ రెవెన్యూ సదస్సులో అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
- కలెక్టర్ సిక్తాపట్నాయక్
మద్దూర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): గుర్తించిన భూసమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్తిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం మండలంలోని నాగంపల్లి, భీంపూర్ గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకు రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలంతో కలిసి రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులపై అధికారులతో మాట్లాడారు. రెవెన్యూ సదస్సులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండాలని ఆర్డీవో రాంచందర్ను కలె క్టర్ ఆదేశించారు. అధికారులు ఉన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 11:14 PM