పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ABN, Publish Date - Jun 26 , 2025 | 11:24 PM
నిరుపేద ల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రె డ్డి అన్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
మల్దకల్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): నిరుపేద ల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రె డ్డి అన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ పథ కం కింద ఇంటిని మంజూరు చేస్తూ వారి సొం త ఇంటి కలను నిజం చేసిందన్నారు. గురువా రం మల్దకల్లోని రైతువేదికలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మండలానికి మొద టి విడతగా 480 ఇళ్లు మంజూరయ్యాయని, రెం డో విడతో మరిన్ని ఇళ్లు మంజూరయ్యే అవకా శం ఉందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్ని కల్లో అన్నిరకాల పథకాలను లబ్ధిదారులకు అం దజేస్తున్న నాయకులను ఎన్నుకోవాలన్నారు. కలెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ పేదల కో సం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చే స్తుందన్నారు. గద్వాల నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులు నెలలోపు నిర్మాణం ప్రారంభించాలని సూచించారు.మొదట బేస్మెం ట్కి లక్ష రూపాయలు, రెండవ విడతో రూ.2ల క్షలు మంజూరు చేస్తుందని తెలిపారు. విడతల వారీగా నగదును ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మ న్ బండారి భాస్కర్, మాజీ ఎంపీపీ బిజ్వారం సత్యారెడ్డి, మధుసూదన్రెడ్డి, గట్టు మాజీ ఎంపీ పీ విజయకుమార్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ఝాన్సీరాణి, ఎంపీడీవో ఆంజనేయరెడ్డి ఉన్నారు.
Updated Date - Jun 26 , 2025 | 11:24 PM