నైపుణ్యాభివృద్ధితో లక్ష్య సాధన
ABN, Publish Date - May 04 , 2025 | 11:15 PM
నైపు ణ్యా భివృద్ధి సాధించినప్పుడే అనుకున్న లక్ష్యం చేరు కుంటామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు
- ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి
బిజినేపల్లి, మే 4 (ఆంధ్రజ్యోతి): నైపు ణ్యా భివృద్ధి సాధించినప్పుడే అనుకున్న లక్ష్యం చేరు కుంటామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు. మండలంలోని పాలెంలోని గా యత్రి పాఠశాలలో జమాత్ ఇస్లామి హింద్ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మైనార్టీ యువత కు నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సదస్సుకు హాజరై ఎమ్మెల్యే మాట్లాడారు. నైపు ణ్యం ఉన్న రంగాన్ని ఎంచుకొని నిత్యం పట్టు దలతో చదివిన, పనిచేసిన ఉన్నత స్థాయికి ఎదగవచ్చని యువతకు స్ఫూర్తి కల్పించారు. అ నంతరం దర్గాలో ముస్లిం పెద్దలతో కలిసి ప్ర త్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటస్వామి, గోవిందు రామకృష్ణ, రాములు, జయకృష్ణ, జహంగీర్, ఖలీల్, రఫీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:15 PM