స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులుకండి
ABN, Publish Date - Jul 19 , 2025 | 11:14 PM
స్థానిక సం స్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్దం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి అన్నారు.
- బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి
గద్వాల, జూలై 19(ఆంధ్రజ్యోతి) : స్థానిక సం స్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్దం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లు మాధవి అన్నారు. శనివారం డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్థాని క సంస్థల ఎన్నికలపై వర్క్షాప్లను నిర్వహించాలని ఆమె సూచించారు. ఈనెల 21, 22, 23వ తేదీలలో మండలాలలో, 25,26వ తేదీల లో బూత్ స్థాయిలో వర్క్షాపులను నిర్వహిం చి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్ధేశం చే యాలని సూచించారు. వచ్చే నెల 1, 2, 3,4, 5వ తేదీల్లో మండలాల్లో సమస్యల పరిష్కారంపై బైక్ ర్యాలీలను నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాలు అందించాలని సూచించారు. అదేవిధంగా 9, 10తేదీల్లో ప్రవాస్ యోజన కార్యక్రమాలలో భాగంగా పార్టీ మోర్చాలు స్థానిక సమస్యలపై అక్కడి ప్రజలు, విద్యావంతులతో చర్చించి పరిష్కారం అయ్యేవిధంగా చూడాలని కోరారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కవ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ డీకే స్నిగ్ధారె డ్డి, జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, మా జీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అక్కల రమాసాయిబాబ, బండల వెం కట్రాములు, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, సీనియర్ నాయకులు బల్గెర శివారెడ్డి, మీర్జాపురం రాంచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లెందొడ్డి వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 11:14 PM