రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ABN, Publish Date - May 08 , 2025 | 11:51 PM
లోడుతో వచ్చిన ధాన్యం బస్తాలను దించుకోకుండా రై స్ మిల్లు యజమానులు రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
కొత్తకోట, మే 8 (ఆంధ్రజ్యోతి) : లోడుతో వచ్చిన ధాన్యం బస్తాలను దించుకోకుండా రై స్ మిల్లు యజమానులు రైతులను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం అ మడబాకులలోని లక్ష్మీనరసింహ రైస్మిల్లును సందర్శించారు. దొడ్డు రకం వస్తే దింపుకోను అని చెప్పడానికి వీలు లేదన్నారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటేశ్వర్లు త దితరులు ఉన్నారు.
Updated Date - May 08 , 2025 | 11:51 PM