ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:34 PM
కార్పొరేషన్ పరిధిలో ఎన్నడూలేని విధంగా పెద్దఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నా యని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి
మహబూబ్నగర్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్ పరిధిలో ఎన్నడూలేని విధంగా పెద్దఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నా యని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. అన్ని వార్డులకు రూ.కోట్లల్లో నిధులు మంజూ రుకాగా ఇప్పుడు కాలనీ రహదారులకు కళ వ చ్చిందన్నారు. శుక్రవారం నగరంలోని 35, 36, 45, 47, 48, 49 వార్డులలో రూ.2.89 కోట్లకు సంబంధించిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది వరకు కాలనీలు ఎలాంటి అభివృద్ధికి నోచుకో లేదని, ఎక్కడికెళ్లినా రోడ్లు, మురుగుకాలువలు కావాలని ప్రజలనుంచి వినతులు వస్తున్నాయ న్నారు. అందుకే కొన్ని వార్డులకు నిధులు కేటా యించి పనులు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేషన్ పెద్దఎత్తున అభివృద్ధి చెం దుతుందని చెప్పారు.
కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్యా దవ్, మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్కుమార్ గౌడ్, నాయకులు ఎన్పీ వెంక టేశ్, సాయిబాబ, చిన్నపాష, రషేద్, లక్ష్మణ్నా యక్, హనుమం తు, సాదత్ పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 11:34 PM