ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:19 PM
ప్ర జావాణిలో వచ్చే ఫిర్యాదుల ను నిర్లక్ష్యం చేయకుండా ఎ ప్పటికప్పుడు పరిష్కరించాల ని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదే శించారు.
వనపర్తి రాజీవ్చౌరస్తా, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : ప్ర జావాణిలో వచ్చే ఫిర్యాదుల ను నిర్లక్ష్యం చేయకుండా ఎ ప్పటికప్పుడు పరిష్కరించాల ని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదే శించారు. సోమవారం కలెక్ట రేట్లోని సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్ట ర్ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా క లెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అ ధికారులపై ఉందన్నారు. సీఎం ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్ర జావాణి ఫిర్యాదులు జిల్లా ప్రజవాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్క రించాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 87 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపా రు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 11:19 PM