మైనార్టీ గురుకులాల్లో మెరుగైన విద్య
ABN, Publish Date - May 13 , 2025 | 11:10 PM
మైనార్టీ గురుకులాల్లో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తెలిపారు.
- భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి
- రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
మహబూబ్నగర్ అర్బన్, మే 13 (ఆంధ్రజ్యోతి): మైనార్టీ గురుకులాల్లో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తెలిపారు. మంగళవారం బోయపల్లి సమీపంలో నిర్మిస్తున్న మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ భవనాలను అధికారులతో కలిసి పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనులు వెంట నే పూర్తి చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. త్వర లో విద్యార్థులకు భవనాలను అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీఎం రేవంత్రెడ్డి విద్యార్థులకు విద్యా మౌ లిక సదుపాయాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ముదిరాజ్, అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్పాష, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి శంకరచారి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 11:10 PM