ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:24 PM
కాం గ్రెస్ ప్రభుత్వంలో పేద విద్యార్థుల విద్యకు వె నుకాడమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అ న్నారు.
గోపాల్పేట, జూలై7 (ఆంధ్రజ్యోతి) : కాం గ్రెస్ ప్రభుత్వంలో పేద విద్యార్థుల విద్యకు వె నుకాడమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అ న్నారు. సోమవారం మండలంలోని బుద్దారం గ్రామ పరిధిలోని గురుకుల పాఠశాలలో రూ. 13.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మే ఘారెడ్డి బుద్దారం గండి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని అనంతరం అక్కడే ఉన్న గు రుకుల పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను ప్రారంభిం చారు. విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ర్థుల కోసం అన్ని సదుపాయాలు ఏర్పాటు చే శామన్నారు. చదువు కోసం మన ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. కాంగ్రెస్ నాయకు లు ఉమ్మడి మండలంలో ఇన్చార్జి సత్యశీలా రెడ్డి, కోటేశ్వర్, రాజు, రవి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 11:24 PM