18 మంది కానిస్టేబుళ్ళకు పదోన్నతి
ABN, Publish Date - Jun 02 , 2025 | 11:40 PM
ఉమ్మడి జిల్లాకు చెందిన 18 మంది కానిస్టేబుళ్ళకు హెడ్కానిస్టేబుళ్ళుగా పదోన్నతి లభించింది.
మహబూబ్నగర్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాకు చెందిన 18 మంది కానిస్టేబుళ్ళకు హెడ్కానిస్టేబుళ్ళుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు డీఐజీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారికి ఆయా జిల్లాల్లో పోస్టింగ్ కూడా ఇచ్చారు. పదోన్నతి పొందిన వారిలో సయ్యద్ యాసిన్, బీ మధుసూదన్రెడ్డి, జే శ్రీనివాస్, వెంకప్ప, వీ నాగరాజు రెడ్డి, జే చెన్నకేశవులు, షాకిర్ఖాన్, ఐజాజ్ అహ్మద్ఖాన్, ఎండీ రియాజ్, ఎన్ బా లయ్య, వెంకట్నాయక్, పీ నాగరాజుగౌడ్, ఎండీ అక్బర్, నరేశ్కుమార్, ఆర్ వెంకట్రెడ్డి, బీ రాజారమేశ్, కే నాగరాజు, కే విజయ్కుమార్ ఉన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 11:40 PM