పోలీస్ ప్రజావాణికి 12 ఫిర్యాదులు
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:06 PM
జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ జానకి
మహబూబ్నగర్ జూలై 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జానకి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 12 ఫిర్యాదులు రాగా, ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడారు. అనంతరం సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులతో మాట్లాడుతూ.. ఫిర్యాదులు ఆన్లైన్లో నమోదుచేయాలని, వాటిపై తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్య చెప్పుకోవడాననికి గ్రీవెన్స్డే అనేది ఒక వేదిక అని, ఇక్కడికి వచ్చిన ఫిర్యాదులు వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 11:06 PM