ర్యాగింగ్, ఈవ్ టీజింగ్కు దూరంగా ఉండాలి
ABN, Publish Date - Jul 25 , 2025 | 12:40 AM
విద్యార్థులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్కు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు.
సిరిసిల్ల క్రైం, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్కు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. గురువారం సిరిసిల్ల పట్ట ణంలోని సహస్ర జూనియర్ కళాశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగా హన పెంచుకోవాలన్నారు. మత్తుపదార్థాలకు ఆకర్శితులు కాకుండా తమ ను తాము కాపాడుకోవాలన్నారు. విద్యార్థులు తమ కెరీర్పై దృష్టి సారించా లన్నారు. ఈ సందర్భంగా జాతీయ న్యాయ సేవలు, బాలబాలికల చట్టాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, న్యాయవాదులు గెంట్యాల భూమేశ్, ప్రిన్సి పాల్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 12:40 AM