ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలి
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:04 AM
రైతులు ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పొం దాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
బోయినపల్లి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను పొం దాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయినపల్లి మండలం మార్లపేట గ్రామంలో ఆయిల్పామ్ మొదటి గెలల కోత, కొనుగోలు కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎక్కువ విస్తీర్ణంలో ఒకే పంటకు బదులు ఆయిల్పామ్ కూడా సాగు చేయాలన్నారు. తాను కూడా ఆయిల్పామ్ పంట సాగుచేస్తానని అన్నారు. అనం తరం కంపెనీ ద్వారా కొనుగోలు ఒప్పంద పత్రాలని రైతుల కు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ వినోద్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వన్నెల రమ ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమ్రెడ్డి మహేశ్వర్రెడ్డి, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.శేఖర్, జిల్లా ఉద్యాన అధి కారి లత, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీ ల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, మండల వ్యవ సాయ అధికారి ప్రణీత, ఉద్యాన శాఖ అధికారులు లోకేష్, గోవర్ధన్, ఏఈఓ రజిత, పంచాయతీ సెక్రెటరీ, ప్రియునిక్ కంపెనీ జనరల్ మేనేజర్ మల్లేశ్వరరావు, జోనల్ మేనేజర్ రోహిత్, జిల్లా మేనేజర్ ప్రేమ్సాయి, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ రైతులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు
బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు కట్ట గోవర్ధన్గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. గ్రామానికి చెందిన 20 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జిల్లా బీసీ అధ్యక్షుడు కూస రవీందర్ ఆధ్వర్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరాడు. సింగిల్ విండో చైర్మన్ వెంకటరామారావు, పార్టీ మండల అధ్యక్షుడు వన్నె ల రమణారెడ్డి, నాగుల వంశీ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 01:04 AM