హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయండి
ABN, Publish Date - May 21 , 2025 | 12:10 AM
కరీంనగర్లో 22న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
భగత్నగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్లో 22న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని వైశ్యభవన్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ఏక్తాయాత్రను వైభవంగా నిర్వహించడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాజకీయాలకతీతంగా ప్రజలు, హిందూ ధర్మం గురించి ఆలోచించే సమాజం, యువత స్వచ్ఛందంగా యాత్రకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మేయర్ వై సునీల్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేష్, కన్నబోయిన ఓదెలు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్రావు, ఉపాధ్యక్షులు కన్న కృష్ణ, బండ రమణారెడ్డి, దండు కొమురయ్య, మాజీ కార్పొరేటర్లు పెద్దపల్లి జితేందర్, వంగల పవన్, సతీష్, దుర్శెట్టి అనూప్, మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, లడ్డు ముందడా, చిట్టి కరుణాకర్, అడిచెర్ల రాజు, తనుకు సాయి, అవుదుర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:11 AM