సమీకృత మార్కెట్కు ఆదరణ కరువు
ABN, Publish Date - Jul 17 , 2025 | 01:13 AM
కరీంనగర్ టౌన్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో కూరగాయలు, వెజ్, నాన్వెజ్, పండ్లు, ఒకే చోట లభ్యమయ్యే విధంగా నిర్మించిన సమీకృత మార్కెట్కు ఆదరణ కరువైంది. నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో సమీకృత మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్కెట్ల నిర్మాణాలను నత్త నడకన సాగాయి. నాలుగింటిలో ఒకే ఒక సమీకృత మార్కెట్ పద్మనగర్లో పూర్తయ్యింది.
- గిరాకీలు లేక ఆందోళన చెందుతున్న వ్యాపారులు, రైతులు
- రోడ్డుపై విక్రయాలకే మొగ్గు
కరీంనగర్ టౌన్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): నగరంలో కూరగాయలు, వెజ్, నాన్వెజ్, పండ్లు, ఒకే చోట లభ్యమయ్యే విధంగా నిర్మించిన సమీకృత మార్కెట్కు ఆదరణ కరువైంది. నగరంలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో సమీకృత మార్కెట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్కెట్ల నిర్మాణాలను నత్త నడకన సాగాయి. నాలుగింటిలో ఒకే ఒక సమీకృత మార్కెట్ పద్మనగర్లో పూర్తయ్యింది. వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని, కలెక్టర్ బంగ్లా ఎదుట చేపట్టిన మార్కెట్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. కాశ్మీర్గడ్డ రైతు బజారును కూల్చివేసి నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదు.
ఫ ఆరు నెలలైనా..
నగరపాలక సంస్థ పదవీకాలం జనవరి 29న ముగిసింది. పద్మనగర్ సమీకృత మార్కెట్ని పదవీకాలం ముగిసేందుకు మూడు రోజుల ముందు ప్రారంభించారు. పద్మనగర్ ప్రాంత ప్రజలే కాకుండా పరిసర డివిజన్ల ప్రజలు, వ్యాపారులు, రైతులు తమకు ప్రయోజనం చేకూరుతుందని ఆశించారు. ప్రారంభోత్సవం తరువాత దాదాపు ఆరు నెలల వరకు మార్కెట్ వైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడలేదు. ఆ తరువాత మార్కెట్లోని దుకాణాలను అర్హులైన వారికి కేటాయించారు. నెల రోజుల క్రితం నుంచి మార్కెట్లోకి కొందరు వ్యాపారులు వచ్చి విక్రయాలు ప్రారంభించినప్పటికి కొనుగోలు దారులు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. సమీకృత మార్కెట్కు ప్రజలనుంచి ఆదరణ లభించడం లేదు. ఇక్కడికి బదులు విధుల్లోనే వ్యాపారం చేసుకుంటే మేలని వ్యాపారులు భావిస్తున్నారు.
ఫ అవగాహన కరువు
పదికోట్లకు పైగా వెచ్చించిన అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ సమీకృత మార్కెట్పై నగరపాలక సంస్థ ప్రజలకు అవగాహన కల్పించడం లేదు. పద్మనగర్ పరిసరాల ప్రాంతాల్లో ఉండే డివిజన్ల నాయకులు, మహిళా సంఘాలు, కాలనీ కమిటీలతో సమావేశాలను ఏర్పాటు చేసి సమీకృత మార్కెట్తో కలిగే ప్రయోజనాలను వివరించాలని ప్రజలు కోరుతున్నారు. సమీకృత మార్కెట్తోపాటు పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ముఖ్య కూడళ్కలల్లో హోర్డింగ్ బోర్డులను ఏర్పాటు చేస్తే ప్రజయోజనం ఉంటుందంటున్నారు. కాశ్మీర్ గడ్డ, కలెక్టరేట్ బంగ్లా, వ్యవసాయ మార్కెట్లోని సమీకృత మార్కెట్లను పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. సమీకృత మార్కెట్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే రోడ్లపై పార్కింగ్, ఇతర సమస్యలు తగ్గుతాయి. ఈ దిశగా కలెక్టర్, నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
Updated Date - Jul 17 , 2025 | 01:14 AM