విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి..
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:40 AM
వర్షాకాలంలో విద్యుత్ ప్రమా దాలు అధికంగా జరుగుతాయని, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని వి ద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్-2) చైర్ప ర్సన్ ఎరుకల నారాయణ కోరారు.
సిరిసిల్ల రూరల్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో విద్యుత్ ప్రమా దాలు అధికంగా జరుగుతాయని, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని వి ద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్-2) చైర్ప ర్సన్ ఎరుకల నారాయణ కోరారు. స్థానిక పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సెస్ ఆధ్వర్యంలో సిరిసిల్ల సబ్డివిజన్లోని విద్యుత్ వినియోగదా రుల సమస్యలను పరిష్కరించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. సీజీఆర్ ఎఫ్-2 చైర్పర్సన్తో పాటు సభ్యులు హాజరుకాగా పలువురు వినియోగదా రులు సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులపై సెస్ ఎండీ విచారణ చేపట్టి సమస్యలను పరిష్కరించాలని చైర్పర్సన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద ర్భంగా చైర్పర్సన్ నారాయణ మాట్లాడుతూ సెస్ పరిధిలో నెలకొన్న విద్యు త్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వినియోగదారులు విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి సెస్ అభివృద్ధికి తోడ్పాటును అందిం చాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరి ష్కార వేదిక సభ్యులు సలంద్ర రామకృష్ణ, లకావత్కిషన్, మర్రిపల్లి రాజా గౌడ్, సెస్ ఎండీ రామసుబ్బారెడ్డి, ఏఏవో పయాకర్రావు రాజేందర్ పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 12:40 AM