ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: శివారులో అంతర్జాతీయ స్థాయిలో ఎకో ఫ్రెండ్లీపార్కు

ABN, Publish Date - Jan 28 , 2025 | 07:54 AM

ప్రకృతి ప్రేమికుల కోసం నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్‌పీరియం’ పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) మంగళవారం ప్రారంభించనున్నారు.

- నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

-150 ఎకరాల్లో 25వేల జాతుల మొక్కలు, చెట్లు

హైదరాబాద్: ప్రకృతి ప్రేమికుల కోసం నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్‌పీరియం’ పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) మంగళవారం ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి(Shankarpally) మండలం ప్రొద్దుటూరు గ్రామంలో అంతర్జాతీయ స్థాయిలో రామ్‌దేవ్‌రావు 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25వేల జాతులకు సంబంధించిన మొక్కలు ఉన్నాయి. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్‌ అమెరికా, స్పెయిన్‌, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్‌, అందమైన శిలలు సేకరించి గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మరిన్ని డబ్బులు అడిగినందుకే చంపేశాడు..


దీని కోసం సుమారు రూ. 150కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో శిల్పానికి రూ. 5లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ. 50 కోట్లతో 12 ఎకరాలలో మ్యాన్‌మేడ్‌ బీచ్‌ ఏర్పాటు చేశారు.


40 గదులు, 20 కాటేజీలతో సుందరమైన సహజ రిసార్టు ద్వీపంగా తీర్చిదిద్దారు. పీవెడ్డింగ్‌, పోస్టు వెడ్డింగ్‌, ఫొటో షూట్‌లకు ఎక్స్‌పీరియంను రామ్‌దేవ్‌రావు ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేశారు. దేశానికి గర్వకారణంగా, రాష్ట్ర ప్రతిష్టకు చిహ్నంగా, హైదరాబాద్‌కు ఐకానిక్‌గా ఎక్స్‌పీరియం ఉంటుందన్నారు. పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao), ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవితోపాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: టకీ టకీ భరోసా..

ఈవార్తను కూడా చదవండి: పరిగిలో పట్టపగలే చోరీ

ఈవార్తను కూడా చదవండి: సూర్యాపేటలో యువకుడి పరువు హత్య?

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Read Latest Telangana News and National News

Updated Date - Jan 28 , 2025 | 07:54 AM