ధాన్యం కొనుగోళ్లు సమర్ధవంతంగా నిర్వహించాలి
ABN, Publish Date - May 10 , 2025 | 11:24 PM
ధాన్యం కొనుగోళ్లు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా గ్రా మీణాఽభివృద్ధి శాఖ డీఆర్డీవో అధికారి కిషన్ అన్నారు. మండలంలోని పలుగ్రామాలలో ఏర్పాటు చే సిన ధాన్యం కోనుగోలు కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు.
జిల్లా గ్రామీణాఽభివృద్ది శాఖ అధికారి కిషన్.
దండేపల్లి, మే 10(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లు సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా గ్రా మీణాఽభివృద్ధి శాఖ డీఆర్డీవో అధికారి కిషన్ అన్నారు. మండలంలోని పలుగ్రామాలలో ఏర్పాటు చే సిన ధాన్యం కోనుగోలు కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఽధాన్యం కుప్పలు, తూకం వేసి న బస్తాలను పరిశీలించి, లారీల ద్వారా రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను పరిశీలించారు. ఆయ న మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైస్మి ల్లులకు తరలించాలని, జిల్లాలోని కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. సమస్యలు లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయడం పాటు లోడింగ్, ఆన్లోడింగ్లో ఆలస్యం కాకుండా సి బ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాన్నారు. కేంద్రాలలో సంచుల కొరత లేకుండా ఎప్పటి కప్పుడు చూసుకుని తెప్పించుకోవాలన్నారు. తూకం వేసి ధాన్యం బస్తాలను ఎప్పటికప్పుడు రైస్మి ల్లుకు తరలించాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జేఆర్ ప్రసాద్, ఐకేపీ ఏపీఎం భూపతి బ్రహ్మయ్య, సీసీలు లావణ్య పాల్గొన్నారు.
Updated Date - May 10 , 2025 | 11:24 PM