ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:28 PM
జిల్లాలోని ప్రభుత్వ బడులను బలోపేతం చే సేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు.
- నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి
నాగర్కర్నూల్ టౌన్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రభుత్వ బడులను బలోపేతం చే సేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్లో జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత విద్యా సంవత్సరం పదో తరగతిలో 500కు పైగా మా ర్కులు సాధించిన జిల్లాలోని ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజే శారు. జేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జ మ్ముల సతీష్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పుర స్కార మహోత్సవానికి ఎంపీ మల్లు రవితో పా టు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హాజరై వి ద్యార్థులకు అవార్డులను ప్రదానంచేశారు. మల్లు రవి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో రూ.200 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంట ర్, జిల్లా లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీగా మార్చడానికి ఏ ర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అంతకు ముందు సీబీసీ మాజీ జేడీ లక్ష్మీనా రాయణ పదోతరగతి తర్వా త విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు ప్రే రణ ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్కుమా ర్, పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్రావు, జిల్లా బాలికా విద్యాధికారి శోభారాణి, ఎంఈవో భాస్కర్రెడ్డి, వందేమాతరం పౌండేషన్ వ్యవ స్థాపకుడు మాధవరెడ్డి, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు షర్పుద్దీన్, కుర్మయ్య, పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 11:28 PM