దళారులను నమ్మి మోసపోవద్దు
ABN, Publish Date - May 01 , 2025 | 11:51 PM
రైతులు ధా న్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి తెలిపారు.
- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్రెడ్డి
బిజినేపల్లి, మే 1 (ఆంధ్రజ్యోతి) : రైతులు ధా న్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్రెడ్డి తెలిపారు. మండలంలోని ఖానాపూర్లో పీఏసీఎస్ ఆధ్వ ర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్ర భుత్వం వరికి కనీస మద్దతు ధరతో పాటు క్విం టాలుకు రూ.500 బోనస్ ఇస్తుందని అన్నారు. ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తే సకా లంలో నగదు చెల్లించకపోవడంతో పాటు తూ కాల్లో మోసం చేసే ప్రమాదం ఉందని హెచ్చ రించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని, రైతులు భ యపడాల్సిన అవసరం లేదని భరో సా కల్పించారు. కార్యక్రమంలో పీ ఏసీఎస్ చైర్మన్ నాయినోళ్ల బాలరా జుగౌడ్ , ఏవో నీతిరెడ్డి, ఏఈవో శా రద, పీఏసీఎస్ సీఈవో రవీందర్, పీఏసీఎస్ డైరెక్టర్లు జిల్లెల నవీన్ రెడ్డి, వెంకటస్వామి, కాంగ్రెస్ మండ ల అధ్యక్షుడు మిద్దె రాములు, డీసీసీ ఉపాధ్యక్షులు బంగారి పర్వతాలు, ముక్తార్, మాజీ సర్పంచులు గంగనమోని తిరు పతయ్య, మస్కూరి అవంతి శంకర్, మాజీ ఎం పీటీసీ వంగ రామన్గౌడ్, మస్కూరి బంగార య్య, దారెడ్డి హనుమంత్ రెడ్డి, ఎడ్ల బాలపీరు, జగ్గని రామకృష్ణ, నగేష్, జయకృష్ణ, చికొండ్ర రా ములు, నరేందర్ గౌడ్, మాన్యనాయక్, వెంకటేష్ గౌడ్, సైదులు తదితరులు ఉన్నారు.
Updated Date - May 01 , 2025 | 11:51 PM