Supreme Court: ఎన్కౌంటర్పై సుప్రీం జడ్జితో విచారణ చేపట్టాలి
ABN, Publish Date - Jan 20 , 2025 | 04:10 AM
సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ
సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్
మహబూబాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కార్యదర్శి బడె చొక్కారావు అలియాస్ దామోదర్ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయానికి ఆదివారం ఆయన ఓ ప్రకటన పంపించారు. ఈ నెల 16న ఛత్తీ్సగఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చొక్కారావుతో పాటు మరో 17 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పారు. దేశ సంపదను కాపాడేందుకు పోరాడుతున్న ఆదివాసీలు, ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించాలని ప్రజలను కోరారు.
Updated Date - Jan 20 , 2025 | 04:10 AM