Home » Maoist Encounter
భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.
ప్రధానిగా నరేంద్ర మోదీకి మూడోసారి అవకాశం ఇస్తే.. ఒకటి రెండేళ్లలో దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా వారిపై పోరాడే దృఢ సంకల్పం కలిగిన పోలీస్ అతను. ఇప్పటివరకు వంద ఎన్కౌంటర్లలో ( Encounter ) 42 మంది మావోయిస్టులను అంతమొందించారు.
ఛత్తీస్గఢ్లోని కాంకెర్లో యాంటీ-మావోయిస్ట్ ఆపరేషనన్ కింద 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బందిని కేంద్ర హోం మంత్రి అమిత్షా అభినందించారు. ఇది భద్రతా దళాల ఘనవిజయని అన్నారు. గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అభిలషించారు.
ఛత్తీస్గఢ్(Chhattisgarh) రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు నక్సలైట్లపై జరిపిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు మరణించిన విషయం విదితమే. ఈ అంశంపై సీఎం విష్ణు దేవ్ స్పందించారు. ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు DRG, BSF సిబ్బందిని విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు.
దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఒకప్పుడు గూగుల్ మూడోకంటికి కూడా అందని విధంగా.. నక్సల్స్కు కంచుకోటగా ఉన్న అబూజ్మడ్లో మంగళవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామేడు అడవుల్లో ఈనెల 7వ తేదీన నక్సల్స్ లక్ష్యంగా వైమానిక దాడులు జరిగాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
ములుగు జిల్లాలో మావోయిస్ట్ లేఖ కలకలం సృష్టించింది. తెలంగాణ - ఛత్తీస్ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ను మావోయిస్ట్ పార్టీ ఖండించింది. పూజార్ - కాంకేర్ ఎన్కౌంటర్ మృతులకు మావోయిస్ట్ పార్టీ జోహార్లు అర్పించింది.
ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.