Home » Maoist Encounter
జార్ఖండ్లోని సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. చోటా నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బాబుదేరా అడవిలో భద్రతా దళాలు కూంబింగ్ చేస్తుండగా ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున ఇరువర్గాలు ఎదురుపడ్డాయి.
తెలంగాణాకి చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్, స్టేట్ కమిటీ సభ్యులు జడే రత్నాబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు ఉన్నారని పోలీస్ శాఖ వివరించింది.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మాచపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఫొదేవా అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం ప్రారంభమైన ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో వీరమరణం పొందారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో గత రెండు రోజులుగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ రోజు జరిగిన ఆపరేషన్లో ఇద్దరు కీలక మావోయిస్టులు హతమయ్యారు.
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావో కీలక నేత పాపారావు టార్గెట్గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయిలాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేసే నీచ స్థితికి ట్రంప్ దిగజారారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఒడిశాలోని కంధమాల్లో జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన.. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా.. వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు..
హిడ్మా ఎన్కౌంటర్పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో సంచలన లేఖ విడుదలైంది. హిడ్మా, శంకర్లు అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వస్తే పోలీసులు పట్టుకుని చంపేశారని ఆరోపించారు.