నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN, Publish Date - May 29 , 2025 | 11:51 PM
ప్రజలకు నిరంతంర తాగునీటిని అం దించేందుకు అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం చెన్నూరు పట్టణంలో నిర్మిస్తున్న అమృత్ 2.0 నీటి ట్యాంకు నిర్మాణ పనుల ను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి సందర్శించారు.
ఫ కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, మే 29 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు నిరంతంర తాగునీటిని అం దించేందుకు అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన ట్యాంక్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం చెన్నూరు పట్టణంలో నిర్మిస్తున్న అమృత్ 2.0 నీటి ట్యాంకు నిర్మాణ పనుల ను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణతో కలిసి సందర్శించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం, అమృత్ 2.0 పథకాల ద్వారా ప్రతి ఇంటికి నిరంతరం తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీ సుకుంటామన్నారు. ట్యాంకు నిర్మాణ పనులను వేగవంతం చేసి నీర్ణీత గడు వులోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంత రం మండలంలోని ఆస్నాద, గంగారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రా లను తహసీల్దార్ మల్లికార్జున్తో కలిసి సందర్శించి కొనుగోలు ప్రక్రియను ప రిశీలించారు. జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కేటాయించిన ప్రకారం రైసుమిల్లులకు తరలిం చాలన్నారు. సన్నరకం వడ్లను విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అందిస్తున్నామన్నారు. జిల్లాలో నిర్ధేశిత లక్ష్యాన్ని పూర్తి చేసి న కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సం బంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పాల్గొన్నారు.
Updated Date - May 29 , 2025 | 11:51 PM