పేదలకు అండగా ఉండేది కాంగ్రెస్
ABN, Publish Date - Jun 04 , 2025 | 11:12 PM
ప్రతి పేద కుటుంబానికి అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభు త్వమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని పేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేశారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం,జూన్4(ఆంధ్రజ్యోతి): ప్రతి పేద కుటుంబానికి అండగా నిలిచేది కాంగ్రెస్ ప్రభు త్వమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ అన్నారు. మండలంలోని పేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మించి ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత అని గత ప్ర భుత్వాలు ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. మంజూరైనప్రతి పేద కుటుంబం ఇళ్ల ని ర్మించుకోవాలని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అదే విధంగా ఇటీవల ఏడీసీసీ బ్యాంక్ పొన్కల్ సింగిల్ విండో సోసైటీలో సభ్యులైన రైతు పం బాల నాగమల్లేశ్ పంటరుణం పొంది చనిపోయాడు. అతడి భార్య రాజేశ్వరికి ఏడీసీసీ బ్యాం క్ మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ మంజూరైన రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీవో షరీఫ్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, నాయకులు అల్లం రవి, ముజాఫర్ అలీ, సయ్యద్ ఫసియుల్లా, మాణిక్యం, మోహన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ముత్యం సతీష్, సయ్యద్ ఇసాక్, దాముక కరుణా కర్లతో పాటు దుమ్మల రమేశ్లు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 11:12 PM