ఆటో యూనియన్ ఽనాయకుల ధర్నా
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:29 PM
తమకు కేటాయించిన స్థలాన్ని మ రొకరికి ఇచ్చే ప్రయత్నాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఆటోడ్రై వర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నస్పూర్ లోని కలెక్టరే ట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
నస్పూర్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : తమకు కేటాయించిన స్థలాన్ని మ రొకరికి ఇచ్చే ప్రయత్నాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి ఆటోడ్రై వర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నస్పూర్ లోని కలెక్టరే ట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ అందించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమకు 25 ఏళ్ల కిందట సింగరేణి అధికారులు ఆ యూనియన్ కొరకు స్థలాన్ని కేటాయించారన్నారు. ఇంత కాలం ఆ స్థలాన్ని తాము వినియోగిస్తున్నామని, ప్రస్తుతం రెవెన్యూ అధికా రులు ఆ స్థలాన్ని స్వచ్చంద సంస్థకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నా రన్నారు. ఆ భూమిని ఎవరికి ఇవ్వకుండ తమకే కేటాయించి పట్టా ఇవ్వా లని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు రాము కుమార్తో పాటు పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jun 16 , 2025 | 11:29 PM