కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:50 PM
అంగన్వాడీ టీచర్స్, హెల్ప ర్స్, మినీ టీచర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ న స్పూర్లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయు) ఆద్వర్యంలో గురువారం ధర్నా చేశా రు.
నస్పూర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : అంగన్వాడీ టీచర్స్, హెల్ప ర్స్, మినీ టీచర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ న స్పూర్లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్ప ర్స్ యూనియన్ (సీఐటీయు) ఆద్వర్యంలో గురువారం ధర్నా చేశా రు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాల య ఏవో సంతోష్కు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఎండల విపరీతంగా ఉన్నందున అంగన్ వాడీ కేంద్రాలకు మే మొత్తం సెలవు ప్రకటించాలన్నారు. ఇది వ రకు ములుగు పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క మే నెలంతా సెలవు ఇస్తామని హామీ ఇచ్చారని, మే నెల దగ్గర పడుతు న్నప్ప టికీ ఏలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రాలేదన్నారు. యూని యన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, నాయకులు దాసరి రాజేశ్వరి, సవిత, విరోనిక, అనురాధ, పద్మ, ప్రవీణ, శారద, సుగుణ, వెంకన్న, శేఖర్ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు
Updated Date - Apr 24 , 2025 | 11:50 PM