నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు
ABN, Publish Date - Jul 15 , 2025 | 11:38 PM
మంచిర్యాలక్రైం, జూలై15 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫి క్ నియమాలు పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుం టామని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ అన్నారు. మంచిర్యాల పట్టణం లోని ఓవర్ బ్రిడ్జి వద్ద స్పెషల్ డ్రైవర్ నిర్వహించారు. ఈ సందర్భం గా నెంబర్లేని వాహనా లను టాంపరింగ్కు పాల్పడిన వాహన దారులను గుర్తించి అక్కడే నెంబర్ ప్లేట్లను బిగించే విధంగా చర్య లు తీసుకున్నారు.
ఏసీపీ ప్రకాశ్
మంచిర్యాలక్రైం, జూలై15 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ట్రాఫి క్ నియమాలు పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుం టామని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ అన్నారు. మంచిర్యాల పట్టణం లోని ఓవర్ బ్రిడ్జి వద్ద స్పెషల్ డ్రైవర్ నిర్వహించారు. ఈ సందర్భం గా నెంబర్లేని వాహనా లను టాంపరింగ్కు పాల్పడిన వాహన దారులను గుర్తించి అక్కడే నెంబర్ ప్లేట్లను బిగించే విధంగా చర్య లు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ చలాన్ల కోసం కొందరు నెంబర్లు పేట్లు తీస్తున్నారని నాలుగు నెంబ ర్లకు బదులు కొన్ని నెంబర్లపై స్టిక్కర్లు వేస్తూ టాంపరింగ్కు పా ల్పడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్, గంజాయి సేవించడం వంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. స్పెషల్ పోలీసుల ద్వారా నిరంతరం తనిఖీలు చేపడుతూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం గా కృషి చేస్తామన్నారు. మంచిర్యాల సీఐ ప్రమోద్రావు, ఎస్ఐ మజారుద్దీన్, స్పషల్ బ్రాంచి పోలీసులు పాల్గొన్నారు.
నస్పూర్లో 25 ద్విచక్ర వాహనాల సీజ్
నస్పూర్ : నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నంబర్లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహనాలపై పోలీసులు కొరఢా ఝుళిపించారు. సీసీసీ కార్నర్ వద్ద మంగళవారం ప్రత్యేక తనిఖీ లు నిర్వహించి నంబరు లేని 25 వాహనాలను సీజ్ చేశారు. వాహనాదా రులకు, మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ వాహనాలకు నంబ రు ప్లేట్లు లేకుండా రోడ్లపై తిరగవద్దని, అది నేరమన్నారు. రోడ్డు భద్రత నిబంధనలకు విర్దుదంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవన్నారు. త నిఖీలో రూరల్ సీఐ ఆకుల అశోక్, ఎస్సై ఉపేందర్ రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 11:38 PM