ఖేలో గేమ్స్లో తెలుగు అథ్లెట్ల జోరు
ABN, Publish Date - May 08 , 2025 | 04:51 AM
ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలుగు క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. బుధవారం బిహార్లోని గయాలో జరిగిన ఈ పోటీల్లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలుగు క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. బుధవారం బిహార్లోని గయాలో జరిగిన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సంపత్, తీర్థు స్విమ్మింగ్ 400 మీటర్ల ప్రీస్టయిల్లో రజతం, కాంస్యం నెగ్గారు. 4-100 మెడ్లే రిలేలో ఏపీ జట్టు కాంస్యం సాధించింది. ఆర్చరీ రికర్వ్ మిక్స్డ్ టీమ్లో ఏపీ జంట కోదండపాణి, వైష్ణవి కాంస్యం అందుకుంది. స్విమ్మింగ్ 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్లో తెలంగాణకు చెందిన సుహాస్ రజతం, 400 మీటర్ల మెడ్లేలో శ్రీనిత్య కాంస్యం, సైక్లింగ్లో తనీష్ కుమార్ కాంస్యం సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 08 , 2025 | 04:51 AM