వాంఖడేలో స్టాండ్..అరుదైన గౌరవం
ABN, Publish Date - Apr 19 , 2025 | 04:00 AM
స్థానిక వాంఖడే మైదానంలోని దివేచా పెవిలియన్ లెవెల్ 3 స్టాండ్కు తన పేరును పెట్టడం.. అరుదైన గౌరవంగా భావిస్తున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు....
ముంబై: స్థానిక వాంఖడే మైదానంలోని దివేచా పెవిలియన్ లెవెల్ 3 స్టాండ్కు తన పేరును పెట్టడం.. అరుదైన గౌరవంగా భావిస్తున్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘వాంఖడేలో నా పేరుపై ఓ స్టాండ్ను ఊహించలేదు. ఇది నాకు దక్కిన గౌరవం’ అని రోహిత్ తెలిపాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ముంబై టీ20 లీగ్ కార్యక్రమంలో రోహిత్ పాల్గొన్నాడు. ఇక, క్రికెట్కు అందించిన సేవలకు గుర్తుగా స్టేడియంలో ఓ స్టాండ్కు రోహిత్, అలాగే మరో రెండు స్టాండ్లకు భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్లను పెట్టినట్టు ముంబై క్రికెట్ సంఘం తెలిపింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 19 , 2025 | 04:00 AM