ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

3 నెలలు 94 మ్యాచ్‌లు

ABN, Publish Date - Apr 29 , 2025 | 05:00 AM

ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి లీగ్‌గా కొనసాగుతున్న ఐపీఎల్‌ను మరింతగా విస్తరించే దిశగా కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా మ్యాచ్‌ల సంఖ్య, టోర్నీ కాలపరిమితిని....

2028 నుంచి ఐపీఎల్‌ విస్తరణ యోచన

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి లీగ్‌గా కొనసాగుతున్న ఐపీఎల్‌ను మరింతగా విస్తరించే దిశగా కసరత్తు జరుగుతోంది. దీనిలో భాగంగా మ్యాచ్‌ల సంఖ్య, టోర్నీ కాలపరిమితిని పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం లీగ్‌లో 74 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అయితే 2028 నుంచి ఈ సంఖ్య 94కు పెంచి, మూడు మాసాలపాటు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు ఐపీఎల్‌ చైర్మన్‌ అరుణ్‌ ధూమల్‌ పేర్కొన్నాడు. తాజా మీడియా హక్కుల కాలపరిమితి 2027 వరకు ఉంది. ఆ తర్వాతి ఏడాది నుంచి జరిగే సైకిల్‌తో ప్రారంభించి మరో 20 మ్యాచ్‌లను పెంచేందుకు అవకాశం ఉందని ధూమల్‌ అన్నాడు. ‘ఇదే విషయమై ఐసీసీలో చర్చిస్తున్నాం. అలాగే బీసీసీఐలోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మ్యాచ్‌లను పెంచే ఆలోచన చేయలేదు. కానీ సమీప భవిష్యత్‌లో నిర్ణయం తీసుకుంటాం’ అని ధూమల్‌ వివరించాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 29 , 2025 | 05:00 AM