భారత్ ఇంగ్లండ్ సిరీస్ నెగ్గేదెవరంటే
ABN, Publish Date - Jun 17 , 2025 | 02:07 AM
భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీ్సలో ఎవరు విజేతగా నిలుస్తారన్న విషయంపై మాజీ క్రికెటర్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఐదు మ్యాచ్ల ఈ సుదీర్ఘ సిరీ్సలో...
గెలుపు చాన్సులపై మాజీల మాట
న్యూఢిల్లీ: భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీ్సలో ఎవరు విజేతగా నిలుస్తారన్న విషయంపై మాజీ క్రికెటర్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఐదు మ్యాచ్ల ఈ సుదీర్ఘ సిరీ్సలో భారత జట్టు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అభిప్రాయపడ్డాడు. అది జరగాలంటే లీడ్స్లో జరిగే తొలి టెస్ట్, మాంచెస్టర్లో జరిగే నాలుగో మ్యాచ్లో గిల్ సేన విజయం సాధించాల్సి ఉంటుందని అన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ మాత్రం ఇంగ్లండ్ 3-2తో సిరీస్ సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. 2025-27 ప్రపంచ టెస్ట్ చాంపియన్షి్ప కొత్త సైకిల్ను ఐదు టెస్ట్ల సిరీ్సతో భారత్-ఇంగ్లండ్ ప్రారంభించనున్నాయి. ఇందులో తొలి టెస్ట్ ఈనెల 20న లీడ్స్లో మొదలు కానుంది. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని ఇంగ్లండ్ చేజిక్కించుకొనే చాన్సుందని భారత మాజీలు దీప్దాస్ గుప్తా, సంజయ్ మంజ్రేకర్ అన్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 17 , 2025 | 02:07 AM